తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఇంటర్ పరీక్ష ఫలితాల ప్రక్రియను ఇప్పటికే ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. కరోనా నేపథ్యంలో ఈసారి ఫలితాలను నేరుగా ఆన్లైన్లోనే విడుదల చేసే అవకాశం ఉంది.మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
పరీక్షా ఫలితాలపై ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. ఇంటర్, మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు గురువారం సాయంత్రం 4గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.