2019 ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నాకొద్దీ.. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పార్టీని జనంలోకి తీసుకెళ్లిపోతున్నారు. తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని.. బాహుబలితో పోలుస్తూ.. పేదల సంక్షేమానికి పాటు పడేది.. తమ పార్టీ మాత్రమే అని చెప్పుకుంటున్నారు. పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. ఇలానే జనాన్ని తమ వైపు తిప్పుకునేందుకు రీసెంట్ గా ప్రయత్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.. అసలైన బాహుబలి అంటే.. వైఎస్ జగనే అన్నారు.. అనిల్. చంద్రబాబుతో కంపేర్ చేయగల సత్తా ఉన్న నాయకుడు కూడా జగనే అని.. ఈ విషయంలో లోకేష్ కు ఏ మాత్రం పోలిక లేదని కామెంట్ చేశారు. జగన్ బాహుబలి అయితే.. లోకేష్ బ్రహ్మానందం లాంటి కమెడియన్ అనీ అన్నారు.