‘లై’, ‘ఛల్ మోహన రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి వరుస పరాజయాల తర్వాత నితిన్ హీరోగా వచ్చిన ‘భీష్మ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మహాశివరాత్రి కానుకగా గత ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో నితిన్, రష్మికల కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆర్గానిక్ వ్యవసాయం అనే కాన్సెప్ట్ తో పాటు ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది.
#Bheeshma | Oct 25 | 6:30 PM
మీ దసరా పండుగ సంతోషాన్ని రెట్టింపు చేయడానికి భీష్మ వచ్చేస్తున్నాడు మీరు రెడీ గా ఉండండి #GeminiTV #BheeshmaOnGeminiTV pic.twitter.com/FSzydtCh5Q
— Gemini TV (@GeminiTV) October 22, 2020
ఇదిలా ఉంటే వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకున్న భీష్మ.. ఇప్పుడు బుల్లి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. దసరా కానుకగా జెమినీ టీవీలో అక్టోబర్ 25 సాయంత్రం 6:30 నిమిషాలకు ప్రసారం కానుంది. తాజాగా జెమినీ టీవీ ఈ విషయాన్ని అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ‘మీ దసరా పండుగ సంతోషాన్ని రెట్టింపు చేయడానికి భీష్మ వచ్చేస్తున్నాడు మీరు రెడీ గా ఉండండి’ అంటూ పోస్ట్ చేశారు.