సైకిల్‌పై సొంతూరికి బయల్దేరిన యువకులు దారిలోనే.. పశ్చిమ గోదావరిలో విషాదం

సైకిల్‌పై సొంతూరికి బయల్దేరిన ఇద్దరు యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు మింగేసింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోవడంతో ఒకరు స్పాట్‌లోనే చనిపోగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. అయితే చనిపోయిన యువకులు ఎవరనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషాద ఘటన జిల్లాలో చోటుచేసుకుంది.

జాతీయ రహదారిపై ఉంగుటూరు మండలం కైకరం వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. లాక్‌డౌన్ కారణంగా ఏలూరులో చిక్కుకుపోయిన ఇద్దరు యువకులు సైకిల్‌పై తాడేపల్లి గూడెం బయల్దేరినట్లు తెలుస్తోంది. కైకరం వద్ద గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు ఎగిరి రోడ్డుపై పడిపోయారు.

Also Read:

తీవ్రగాయాలు కావడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరిని సమీపంలోని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుల వివరాలు తెలియకపోవడంతో వారి వద్ద లభించిన సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. వారి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే పనిలో పడ్డారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here