షాకింగ్‌.. క్వారంటైన్ రూల్స్‌ ఉల్లంఘించింద‌ని 6 నెల‌ల చిన్నారిపై కేసు

క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తున్న‌వేళ చాలా మందిని హోమ్ క్వారంటైన్‌లో ఉంచుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఉత్త‌రాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉత్క‌ర్షి జిల్లాలో 6 నెల‌లు, మూడేళ్ల చిన్నారులు హోమ్ క్వారంటైన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని తేల్చిన అధికారులు కేసు బుక్ చేయ‌డం షాక్‌కు గురిచేస్తోంది. తాజాగా ఈ ఘ‌ట‌న వెలుగులోకి రావ‌డంతో స‌ద‌రు అధికారిని స‌స్పెండ్ చేశారు. ఇళ్ల‌కెళ్లి విచార‌ణ చేయ‌కుండానే, ఫోన్‌లో స‌మాచారం సేకరించిన ఆ అధికారి కేసు తప్పుడు రిపోర్టు తెలుస్తోంది.

Must Read:

నిజానికి లాక్‌డౌన్ స‌మ‌యంలో 47మందితో క‌లిసి ఈ చిన్నారులు క‌రోనా వేళ వేరే ఊరి నుంచి త‌మ స్వ‌గ్రామానికి వ‌చ్చారు. వీరంతా హోమ్ క్వారంటైన్ పాటించాల‌ని అధికారులు ఆదేశించారు. అనంత‌రం వీరి క్వారంటైన్‌పై రిపోర్టును రూపొందించాల‌ని సాగునీటి శాఖ స‌హాయ ఇంజినీర్ గిరీష్ రాణాను అధికారులు నియ‌మించారు.

Must Read:

అయితే ఈనెల 10న 47 మందిని ఫోన్‌లోనే విచారించిన రాణా.. వీరంతా హోం క్వారంటైన్‌ను పాటించ‌డం లేద‌ని, ఇత‌రుల‌కు ప్ర‌మాద‌కారిగా మారార‌ని రిపోర్టు అందించారు. దీంతో అధికారులు కేసు బుక్ చేశారు. ఇందులో ఆ ఇద్ద‌రు చిన్నారులు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం, తాజాగా ఈ ఘ‌ట‌న వెలుగులోకి రావ‌డంతో అధికారులు విచార‌ణ చేశారు. విధుల్లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన రాణాను ఈనెల 22న‌ సస్పెండ్ చేశారు. త‌ప్పుడు రిపోర్టు కారణంగా 47 మందిపై న‌మోదైన కేసుల‌ను ఎత్తివేయ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఇక ఉత్త‌రాఖండ్‌లో 47 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 24 మంది కోలుకోగా.. 23 మందికి చికిత్స అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here