రవిప్రకాష్ పై ఈడీ కేసు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. రవిప్రకాష్ తోపాటు మరో ఇద్దరు అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ లో 2018 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకు రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా తీశారని ఆ సంస్థ ప్రతినిధి గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

2019 అక్టోబర్ లో కేసు నమోదు కాగా.. ఈడీ ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేసింది. అలాగే రవిప్రకాష్ కు సమన్లు ఇచ్చి ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్టుల తెలుస్తోంది.
టీవీ9 సంస్థలో రూ.18 కోట్ల స్కాం జరిగిందనే ఆరోపణలపై 2019 అక్టోబర్ లో రవిప్రకాష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రవిప్రకాష్ తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది.

ఈడీ ఇప్పుడు ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. 2018లో అలంద మీడియా టీవీ9లో మెజార్టీ షేర్లను కొనుగోలు చేసింది.అయితే ఆ అకౌంట్లను పరిశీలిస్తే ఈ స్కాం బయటపడినట్లు సంస్థ చెప్పింది. డైరెక్టర్లు షేర్ హోల్డర్ల అనుమతి లేకుండానే రవిప్రకాష్ డబ్బులు తీశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం రవిప్రకాష్ బెయిల్ పై విడుదలై విచారణను ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఈడీ రంగ ప్రవేశంతో కేసు మరో మలుపు తిరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here