అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 2 విడుదల చేయనున్న విషయం తెలిసిందే. నిజానికి చివరి వరకు ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్న దర్శకనిర్మాతలు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఓటీటీ వైపు మొగ్గుచూపారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో అనుష్క సాక్షి అనే దివ్యాంగురాలి(చెవులు వినపడని, మాటలు రాని) పాత్రలో నటించారు.
తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో ట్రైలర్ ను విడుదల చేసింది. మాధవన్, అనుష్క ఓ దెయ్యముండే ఇంట్లోకి వెళతారు. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? సోనాలి ఎందుకు కనపడకుండా పోయింది? లాంటి ఆసక్తికరమైన అంశాలను ట్రైలర్ లో చూపించారు. సినిమాపై ఆసక్తిని పెంచేలా ట్రైలర్ ఉంది. ఇక ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు అండ్రూ హడ్సన్, హీరోయిన్ అంజలి పోలీస్ ఆఫీసర్లుగా నటించారు. మరి ఆసక్తిని రేకెత్తిస్తోన్న చిత్ర ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.