జాతీయ మీడియాకు చురకలు అంటించిన హరీష్ శంకర్. గత రెండు రోజులుగా ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ వార్తా పత్రిక తిరగేసినా.. బాలసుబ్రహ్మణ్యం మరణానికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఒక లెజెండ్ మరణించారంటూ, ఇది ఒక్క తెలుగు వారికే కాకుండా యావత్ భారతదేశానికి తీరనిలోటంటూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ బాల సుబ్రహ్మణ్యంకు నివాళులర్పించారు. ఇదిలా ఉంటే బాలసుబ్రహ్మణ్యం మరణవార్తకు జాతీయ మీడియా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ ఆరోపించారు.
బాల సుబ్రహ్మణ్యం మరణవార్తను బీబీసీ ఇంటర్నేషనల్ ఛానల్ కవర్ చేసిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన హరీష్ శంకర్.. “ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో..మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తోంది..అంతేలే.. కొందరి స్థాయి విశ్వవ్యాప్తం.. ఇరుకు సందుల్లో కాదు..” అంటూ జాతీయ మీడియాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇక హరీష్ చేసిన ట్వీట్ కి స్పందిస్తూ… పలువురు నెటిజెన్లు కూడా జాతీయ మీడియాపై ఫైర్ అవుతున్నారు.
ఇంటర్నేషనల్ మీడియా కూడా ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసిందో..
మన నేషనల్ మీడియా ని చూస్తే జాలేస్తుంది..అంతేలే..
కొందరి స్థాయి విశ్వవ్యాప్తం..
ఇరుకు సందుల్లో కాదు.. pic.twitter.com/hcYDqMU9WK
— Harish Shankar .S (@harish2you) September 26, 2020