హైదరాబాద్ యువతికి టోకరా.. పెళ్లి పేరుతో రూ.12.45లక్షలు కొట్టేసిన నైజీరియన్

ఇటీవల కాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ సమయంలో ఎందరో హైదరాబాదీలు సైబర్ వలలో పడి మోసపోతున్నారు. ఇలాగే నైజీరియన్ ముఠా వలలో పడిన యువతి రూ.లక్షల్లో మోసపోయింది. తాను లండన్‌కు చెందిన ఇంజినీరునని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పరిచయమైన నెలరోజుల్లోనే ఆమెకు వజ్రాలు, బంగారు బిస్కెట్లు బహుమతిగా పంపానని మాయమాటలు చెప్పాడు. పలు దఫాలుగా ఆమె వద్ద నుంచి రూ.12.45 లక్షలు దోచుకున్నాడు. తర్వాత మోసపోయానని గ్రహించిన బాధితురాలు బుధవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది

Also Read:

కొంపముంచిన మ్యాట్రిమోనీ పరిచయం..

హైదరాబాద్‌ నగరంలోని బోరబండ ప్రాంతానికి చెందిన యువతి కొద్దినెలల కిందట భారత్‌ మ్యాట్రిమొనీలో రిజిస్టర్ చేసుకుంది. ఏప్రిల్ 2న ఆమె వ్యక్తిగత వివరాలు పరిశీలించిన ఓ వ్యక్తి తాను లండన్‌లో స్థిరపడిన ఇంజినీరునని పరిచయం చేసుకున్నాడు. తన పేరు కెల్లీహేరీ అని.. ఇష్టమైతే పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదన తెచ్చాడు. పెళ్లయ్యాక హైదరాబాద్‌లోనే స్థిరపడి ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేద్దామని చెప్పాడు. అప్పటి నుంచి ఇద్దరూ వాట్సాప్‌ ద్వారా ఛాటింగ్ చేసుకుంటున్నారు.

Also Read:

గత నెల 12న యువతికి ఫోన్‌చేసిన ఆ వ్యక్తి పెళ్లి ఖర్చుల నిమిత్తం 85 వేల పౌండ్లు(ఇండియన్ కరెన్సీలో రూ.61 లక్షలు), వజ్రాలు, బంగారు బిస్కెట్లు పంపుతున్నానంటూ చెప్పాడు. ఆ తర్వాత కొద్ది గంటలకే దిల్లీ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్‌ అధికారులమంటూ ఆమెకు ఓ వ్యక్తి ఫోన్‌ చేశాడు. మీ పేరు మీద కానుకలు వచ్చాయని, ముందుగా రూ.28 వేలు చెల్లించాలని చెప్పగా ఆమె అలాగే చేసింది. అలా వివిధ ఛార్జీల కింద 10 రోజుల వ్యవధిలో రూ.12.45 లక్షల మనీని ఆమె ట్రాన్స్‌‌ఫర్ చేసింది. ఆ తర్వాత గిఫ్టులు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించి బుధవారం సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌‌కు ఫోన్ చేసింది. ఆయన ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here