వర్క్ ఫ్రం హోం చేస్తున్న భర్త గది డోర్ కొట్టి.. బిల్డింగ్ పైనుంచి దూకిన భార్య

పదకొండు నెలల చిన్నారిని దారుణంగా చంపేసి తల్లి చేసుకున్న విషాద ఘటన వెలుగుచూసింది. డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆమె బిడ్డను కర్కశంగా చంపేసి బిల్డింగ్‌ పై నుంచి దూకేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. భోపాల్‌లోని బైరాగఢ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి పూణెలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఇండోర్‌కి చెందిన మహిళతో వివాహమైంది. వారికి 11 నెలల కూతురు ఉంది.

హోలీ పండుగ సందర్భంగా టెకీ కుటుంబంతో కలసి వచ్చాడు. లాక్‌డౌన్ కారణంగా భోపాల్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంటి వద్దనే వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నాడు. కొద్దికాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్న అతని భార్య సడెన్‌గా బిల్డింగ్‌ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కూతురిని ఊపిరాడకుండా చేసి చంపేసి ఆ తరువాత మూడో అంతస్తు నుంచి కిందకు దూకి సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Also Read:

టెర్రస్‌పై ఉన్న గదిలో వర్క్‌ ఫ్రం హోమ్ చేసుకుంటున్న సమయంలో డోర్ కొట్టిన శబ్దం అవడంతో తలుపుతీశానని.. పాప అచేతనంగా కింద పడి ఉండడం చూసి తనను లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని భర్త చెప్పాడు. ఆ సమయంలో తన భార్య మెట్లెక్కి పైకి వెళ్లడం చూసి ఆపేందుకు ప్రయత్నించానని.. ఆమె తనను చూసి వేగంగా వెళ్లి మూడో అంతస్తు నుంచి కిందకు దూకేసిందని పోలీసులకు వివరించాడు.

తొలిసారి గర్భం పోయినప్పటి నుంచి ఆమె డిప్రెషన్‌తో బాధపడుతోందని.. కూతురు పుట్టాక కూడా మార్పు రాలేదని చెప్పాడు. ఆస్పత్రిలో చూపించి మందులు వాడుతున్నామని.. కొద్దికాలంగా ఆమె మందులు వాడడం మానేసిందని పేర్కొన్నాడు. చిన్నారిని అన్యాయంగా చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుందని చెప్పి వాపోయాడు. ఆమె రిపోర్ట్స్ పూణెలో ఉన్నాయని చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here