భారత ఉత్పత్తులనే వాడాలి.. అందుకు గర్వపడాలి: మోదీ

భా రతీయులంతా స్థానిక ఉత్పత్తులనే వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్థానిక వస్తువులను ఉపయోగించడం పట్ల గర్వపడాలని పేర్కొన్నారు. మన ఉత్పత్తులకు మద్దతు అందించే చర్యలు చేపట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఖాదీ వస్తువులను కొనుగోలు చేస్తే స్థానిక చేనేతకారులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ‘స్థానికం’ను మన జీవన మంత్రగా మార్చుకోవాల్సిన సమయం వచ్చింది అని మోదీ పేర్కొన్నారు.

మంగళవారం (మే 12) రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా లాక్‌డౌన్‌తో కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమిస్తూ.. రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. గెలిచి తీరాల్సిన యుద్ధంలో భారత్ ప్రపంచానికే వెన్నుదన్నుగా నిలిచిందని పేర్కొన్నారు. ‘21వ శతాబ్దం భారత్‌దే అని చెప్తుంటే విన్నాం. కరోనా సంక్షోభ సయమంలో అది చూస్తున్నాం. ఈ సంక్లిష్ట సమయంలో ప్రపంచ దేశాలను ఆదుకునే అవకాశం వచ్చింది. ఆపదను భారత్ అవసరంగా మార్చుకుంటుందని ప్రపంచానికి నిరూపించి చూపింది’ అని మోదీ అన్నారు. ఇకపై మన వ్యూహాలకు పదునుపెట్టి మరింత సమర్థంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

దేశంలో లాక్‌డౌన్‌లో కొనసాగుతుందని ప్రధాని మోదీ సంకేతం ఇచ్చారు. మే 18కు ముందు లాక్‌డౌన్ 4.0 వివరాలు ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంలో రాష్ట్రాలు ఇచ్చే సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాని తెలిపారు. కరోనాతో పోరాడుతూనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కరోనా ఇప్పుడప్పుడే మానవాళిని విడిచి వెళ్లే అవకాశం లేదని అనేక మంది శాస్త్రవేత్తలు చెబుతున్నారని మోదీ అన్నారు. ఈ సంకట సమయంలో ప్రజలంతా సంకల్ప బలంతో ముందుకు సాగాలని మోదీ సూచించారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here