పొలంలో వివాహిత మర్డర్.. పక్కనే అచేతనంగా యువకుడు.. గుంటూరులో మిస్టరీ

వివాహితను దారుణంగా చంపేసిన ఘటన వెలుగుచూసింది. పొలంలోకి తీసుకెళ్లి విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గుంటూరు రూరల్ మండల పరిధిలోని ఏటుకూరు గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి హత్యకు గురైంది. వట్టిచెరుకూరు మండలం 5వ మైలు వద్ద పొలాల్లో ఆమెను దారుణంగా హత్య చేశారు.

అయితే ఆమె శవం పక్కనే ఓ యువకుడు అచేతనంగా పడి ఉండడం చర్చనీయాంశంగా మారింది. సమీపంలోని కొండేపాడు గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసినట్లు తెలుస్తోంది. పొలాల్లో పడి ఉన్న ఇద్దరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Also Read:

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో పడి ఉన్న యువకుడిని వెంటనే గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహం పక్కనే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో యువకుడు పడి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతనే ఆమెను కిరాతకంగా హత్య చేసి.. ఆ తరువాత ఆత్మహత్యా యత్నం చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here