తబ్లిగీ జమాత్ చీఫ్‌కు కరోనా నెగెటివ్

భారత్ లో కరోనా వ్యాప్తి విదేశాల్లో ఉన్నవారు ఇక్కడి రావడంతో మొదలైంది. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ సమావేశం అనంతరం మరింత వ్యాపించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మౌలానా సాద్ కంధాల్వీపై హత్యానేరం, మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా సాద్ కంధాల్వీకి కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు నెగెటివ్ అని రిపోర్టు వచ్చింది. ఈ మేరకు ఆయన న్యాయవాది వెల్లడించారు. జమాత్ చీఫ్ కరోనా టెస్టుల నివేదికలు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఇంకా అందలేదు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం సాద్ కంధాల్వీని విచారించే అవకాశాలు ఉన్నాయి.

భారత్‌లో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందడానికి కారణం తబ్లిగీ జమాత్. గత మార్చి నెలలో దేశ రాజధాని ఢిల్లీ మర్కజ్ భవన్‌లో ఏర్పాటు చేసిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. ఈ వేదికకు రూపకర్త తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ కంధల్వి ఢిల్లీ క్రైం బ్రాంచ్‌కి లేఖ రాశారు. తాను దర్యాప్తుకు సహకరిస్తాను అని ఏప్రిల్ 16 (గురువారం) నగర పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ 8 వరకు క్వారంటైన్‌లో ఉన్నారు మౌలానా సాద్. సాద్ ఐసోలేషన్ కాలం ముగిసినందున దర్యాప్తుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తరపు న్యాయవాది పోలీసులకు సైతం తెలిపారు.

మర్కజ్ సమావేశాలకు ఆయన పురిగొల్పాడని, గురించిన సమాచారం ఉన్నప్పటికీ సంబంధిత హెచ్చరికలను ఖాతరు చేయకుండా సమావేశాలు నిర్వహించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 80కి పైగా దేశాల అనుచరులను సమాయత్తం చేసే తబ్లిగి ప్రపంచంలోని అతిపెద్ద సున్నీ ముస్లిం సంస్థలలో ఒకటి. ఈ కార్యక్రమంలో దాదాపు 9,000 మంది పాల్గొన్నట్లు అంచనా. సమావేశాలకు హాజరైన వారంతా భారత దేశంతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన వారే. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన అత్యధిక కరోనా కేసుల్లో ఈ తబ్లిగీ జమాత్‌కు సంబంధం ఉన్నవారే అని ప్రభుత్వం అంచనా వేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here