చెల్లెళ్లపై కన్నేసిన కామపిశాచి.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

చెల్లెళ్లపై కన్నేశాడో కామాంధుడు. కామంతో కళ్లుమూసుకుపోయి అభంశుభం తెలియని బాలికలపై అత్యాచారానికి తెగబడ్డాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి రేప్ చేశాడు. చిన్నారుల ఏడుపులు విన్న స్థానికులు గమనించి దగ్గరకు రావడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ అత్యంత దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో వెలుగుచూసింది.

ఏడు, ఎనిమిదేళ్ల వయసున్న అక్కాచెల్లెళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. వరుసకు అన్నయ్యే వ్యక్తి పశువులా మారి చిన్నారుల జీవితాలను చిదిమేశాడు. రాజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలను అదే గ్రామానికి చెందిన బల్వీర్ సింగ్ దారుణంగా రేప్ చేశాడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికలకు మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లాడు.

Also Read:

వరుసకు అన్నయ్యే వ్యక్తి పిలవడంతో బాలికలు అతని వెంట వెళ్లారు. వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన దుర్మార్గుడు అతినీచంగా అత్యాచారరం చేశాడు. ఇద్దరు బాలికలను దారుణంగా రేప్ చేశాడు. ఏం జరుగుతుందో తెలియక నొప్పితో విలవిల్లాడుతూ బాలికలు పెట్టిన కేకలు విని స్థానికులు దగ్గరకు వస్తుండడంతో నిందుతుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రాజాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here