కరోనాతో మహారాష్ట్రలో 36 మంది మృతి.. 23 వేలు దాటిన కేసులు

మ హారాష్ట్రలో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. కరోనా కారణంగా ఆ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 36 మంది మరణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో కరోనా కేసులు 70 వేలకు చేరువలో ఉండగా.. అందులో 23 వేల కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయంటే.. అక్కడ వైరస్ వ్యాప్తి ఏరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ముంబైలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

మహారాష్ట్రలో సోమవారం (మే 11) 1236 కొత్త కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 23,401కి ఎగబాకింది. 36 మరణాలతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 868కి చేరింది. సోమవారం నమోదైన కేసుల్లో 791 కేసులు ముంబైలోనే నిర్ధారణ కావడం గమనార్హం. దీంతో ముంబైలో కరోనా కేసుల సంఖ్య 14,355కు చేరింది. ఆసియాలోనే అత్యంత మురికివాడ ధారావిలో వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది.

అటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గడిచిన 24 గంటల్లో కరోనాతో 19 మంది మరణించడం గమనార్హం. అహ్మదాబాద్ నగరంలో కరోనా కేసుల సంఖ్య 6086కు చేరింది. గుజరాత్‌లో గడిచిన 24 గంటల్లో మొత్తం 347 కరోనా కేసులు నమోదు కాగా.. 20 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 513 మంది మరణించారు. మొత్తం కేసులు సంఖ్య 8542కు చేరింది. ఇదే సమయంలో కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య పెరుగుతోంది. గుజరాత్‌లో ఇప్పటివరకు 2780 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Also Read:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here