అంబులెన్స్‌లో తండ్రిని పడుకోబెట్టి.. పెళ్లికొడుకు హైడ్రామా.. చివరికి షాకింగ్ ట్విస్ట్

తండ్రి అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ పిలిపించారు. అందులో తండ్రిని పడుకోబెట్టి యువకుడు వెంట వెళ్లాడు. అక్కడ సీన్ కట్ చేస్తే.. చక్కగా పెళ్లి చేసుకుని భార్యతో తిరిగొచ్చాడా యువకుడు. వచ్చిన వాడు మామూలుగా ఉంటే ఫర్వాలేదు. పెళ్లి వేడుకల పేరుతో ధూంధాం చేయడంతో పోలీసులు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.

వివాహం కోసం లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి అడ్డంగా బుక్కయ్యాడో పెళ్లికొడుకు. పెళ్లి కోసం హైడ్రామాకు తెరతీశాడు. ముజఫ్ఫర్ నగర్‌కి చెందిన అహ్మద్‌కి ఢిల్లీకి చెందిన యువతితో వివాహం కుదిరింది. అయితే సడెన్‌గా విధించడంతో పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. అత్యవసర వాహనాలకు మినహా ఇతర వాహనాలకు అనుమతులు ఇవ్వడం లేదు. అనుకున్న సమయానికి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని భావించిన పెళ్లికొడుకు పక్కా ప్లాన్ సిద్ధం చేశాడు.

Also Read:

తండ్రికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి అంబులెన్స్ పిలిపించాడు. అందులో తండ్రిని పడుకోబెట్టి బయల్దేరాడు. మార్గంమధ్యలో పోలీసులు ఆపితే తండ్రి ఆరోగ్యం బాగా లేదని.. ఢిల్లీ ఆస్పత్రికి తీసుకెళ్తున్నానని చెప్పడంతో వదిలేశారు. అలా ఢిల్లీ చేరిన యువకుడు అప్పటికే రెడీగా ఉన్న పెళ్లికూతురిని వివాహం చేసుకుని తండ్రితో కలసి అదే అంబులెన్స్‌తో తిరిగి ఇంటికి వచ్చాడు.

తండ్రిని అంబులెన్స్‌లో తీసుకెళ్లి భార్యతో తిరిగొచ్చిన యువకుడు పెళ్లి వేడుకల పేరుతో ఇంట్లో ధూంధాం చేస్తుండడంతో ఇరుగుపొరుగు ఊహించని షాకిచ్చారు. ఫోన్ చేసి సమాచారం అందించడంతో పోలీసులు సీన్‌లోకి ఎంటరయ్యారు. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు.. ఎలా చేసుకున్నారు వంటి విషయాలు ఆరా తీయడంతో అసలు బాగోతం బయటపడింది. దీంతో కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కి తరలించారు.

Read Also:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here